సచిన్ జోషితో రవికుమార్ పనస ‘బిజినెస్ డీల్’
- April 12, 2018
హైదరాబాద్:సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషితో కలిసి, ఆర్కే మీడియా సంస్థ అధినేత రవికుమార్ పనస అసోసియేట్ అయ్యారు. సచిన్ జోషి అంటే, తెలుగులో ‘ఒరేయ్ పండు‘ తదితర సినిమాల్లో నటించిన బబ్లీ హీరో గుర్తుకొస్తాడు. అయితే, సినీ నటుడిగానే కాక, వ్యాపారవేత్తగానూ సచిన్ జోషి సుపరిచితుడు. పలు రకాలైన వ్యాపారాల్ని నిర్వహిస్తోన్న సచిన్ జోషికి, ఓ లిక్కర్ కంపెనీ కూడా వుంది. గోవా కింగ్స్ పేరుతో లభించే బీర్ చాలా ప్రత్యేకమైనది. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో వున్న ఈ బీర్ ప్రోడక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ గా తమకు అవకాశం లభించిందని రవికుమార్ పనస చెప్పారు. పీఆర్వో, అసిస్టెంట్ డైరెక్టర్, మూవీ ప్రమోటర్.. ఇలా సినీ పరిశ్రమతో వివిధ రకాలుగా అసోసియేట్ అయి వున్న రవికుమార్ పనస, తాజాగా లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ గా మారుతుండడం గమనార్హం. ఈ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి చాలామంది పోటీ పడినా, రవికుమార్ పనసతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం నేపథ్యంలో సచిన్ జోషి, ఆ అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. మల్టీ బిజినెస్ వింగ్ అనే ఆలోచనతో రవికుమార్ పనస వివిధ రంగాల్లోకి అడుగు పెడుతున్నారు. ఏ రంగంలోకి అడుగు పెట్టినా, అంతిమంగా ఆ రంగంలో విజయాన్ని అందుకోవాలన్న తపనే తనను ఇంతటివాడ్ని చేసిందని చెబుతున్నారాయన. జెెఎంజె గ్రూప్ అధినేత సచిన్ జోషికి మరోసారి థ్యాంక్స్ చెప్పారు రవికుమార్ పనస.


తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







