చిన్నారి ఘటనపై తీవ్రంగా స్పందించిన బాలీవుడ్
- April 13, 2018
గోవధ చేశారని చిన్నారి కుటుంబసభ్యులను అనుమానించిన దుండగులు.. బకర్వాల్ ముస్లిములను ఊళ్లోంచి తరిమేయాలని నిర్ణయించారు. ఆ వర్గానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని 4 రోజులపాటు గుడిలో బంధించి ఒకరి తర్వాత మరొకరుగా నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కర్రతో కొట్టి అతి దారుణంగా ఆమెను చంపేశారు. ఈ ఘటనపై బాలీవుడ్ తీవ్రంగా స్పందించింది. ‘‘మనం మనుషులమేనా..? పసిబిడ్డలపై కామాంధులు పైశాచికానికి తెగబడుతుంటే కళ్లు మూసుకొని కూర్చుందామా? ఏమైపోతోంది మన సభ్యసమాజం?’’ అంటూ నిగ్గదీసింది. ‘నా హృదయం ముక్కలైంది. 8 ఏళ్ల అసీఫానే కాదు.. మనందరి మనస్సాక్షిని చంపేశారు’ అని దియా మిర్జా ట్వీట్ చేశారు. ‘చిన్నారి అసీఫా అమాయకపు చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి’ అని అక్షయ్ పోస్టు చేశారు.ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అర్జున్కపూర్ దుయ్యబట్టారు. ‘ఎనిమిదేళ్ల చిన్నారిని ఆ దుర్మార్గులు ఎంత క్రూరంగా హింసించారో..! స్పందించకపోతే మనం మనుషులమెలా అవుతాం?..’ అంటూ ఫర్హాన్ అక్తర్ ప్రశ్నించారు. ‘ఇదా నా దేశ దుస్థితి. నమ్మలేకపోతున్నాను’ అని సోనమ్ పోస్టు పెట్టారు. కఠువా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అసిఫా ఫొటోను అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడు మనమంతా ఒకటికాగలం అంటూ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రశ్నించారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









