చిన్నారి ఘటనపై తీవ్రంగా స్పందించిన బాలీవుడ్
- April 13, 2018
గోవధ చేశారని చిన్నారి కుటుంబసభ్యులను అనుమానించిన దుండగులు.. బకర్వాల్ ముస్లిములను ఊళ్లోంచి తరిమేయాలని నిర్ణయించారు. ఆ వర్గానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని 4 రోజులపాటు గుడిలో బంధించి ఒకరి తర్వాత మరొకరుగా నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కర్రతో కొట్టి అతి దారుణంగా ఆమెను చంపేశారు. ఈ ఘటనపై బాలీవుడ్ తీవ్రంగా స్పందించింది. ‘‘మనం మనుషులమేనా..? పసిబిడ్డలపై కామాంధులు పైశాచికానికి తెగబడుతుంటే కళ్లు మూసుకొని కూర్చుందామా? ఏమైపోతోంది మన సభ్యసమాజం?’’ అంటూ నిగ్గదీసింది. ‘నా హృదయం ముక్కలైంది. 8 ఏళ్ల అసీఫానే కాదు.. మనందరి మనస్సాక్షిని చంపేశారు’ అని దియా మిర్జా ట్వీట్ చేశారు. ‘చిన్నారి అసీఫా అమాయకపు చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి’ అని అక్షయ్ పోస్టు చేశారు.ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అర్జున్కపూర్ దుయ్యబట్టారు. ‘ఎనిమిదేళ్ల చిన్నారిని ఆ దుర్మార్గులు ఎంత క్రూరంగా హింసించారో..! స్పందించకపోతే మనం మనుషులమెలా అవుతాం?..’ అంటూ ఫర్హాన్ అక్తర్ ప్రశ్నించారు. ‘ఇదా నా దేశ దుస్థితి. నమ్మలేకపోతున్నాను’ అని సోనమ్ పోస్టు పెట్టారు. కఠువా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అసిఫా ఫొటోను అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడు మనమంతా ఒకటికాగలం అంటూ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!