నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2018 : శ్రీదేవి, వినోద్ ఖన్నా లకు అవార్డులు
- April 13, 2018
భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అద్భుతమైన నటుల్లో అందాల తార శ్రీదేవి, వినోద్ ఖన్నా ఒకరు. వీరిద్దరూ ఈ లోకంలో లేకపోయినా చిత్ర పరిశ్రమ, అభిమానుల గుండెల్లో మాత్రం చిరకాలం నిలిచిపోయేంతగా పేరు తెచ్చుకున్నారు. హఠాన్మరణంతో సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టిన శ్రీదేవికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించగా..అనారోగ్యంతో చనిపోయిన వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.
అయితే ఈ సారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 మంది ప్రముఖుల పేర్లను పరిశీలించింది. చివరికి అవార్డును వినోద్ ఖన్నాకు ఇవ్వాలని నిర్ణయించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో శ్రీదేవి నటించిన తొలి చిత్రం 'ఇంగ్లిష్ వింగ్లిష్'. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె తమిళంలో వచ్చిన 'పులి', భర్త బోనీ కపూర్ నిర్మించిన 'మామ్' చిత్రాల్లో నటించారు. 'మామ్' సినిమాలో శ్రీదేవి నటనకు గానూ జాతీయ అవార్డు లభించింది.
శ్రీదేవి ఉండుంటే బాగుండేది: బోనీ
శ్రీదేవికి జాతీయ అవార్డు రావడంతో బోనీ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తానిక్కడ ఉండి ఉంటే బాగుండేది. శ్రీదేవి అందుకున్న తొలి జాతీయ అవార్డు ఇది. చాలా విషయాలు గుర్తుకు వస్తున్నాయి.' అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఆస్కార్ సమయంలోనూ..!
ఇటీవల అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన 'ఆస్కార్' అవార్డుల వేడుకలోనూ శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు. అవార్డు కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రముఖ అమెరికన్ మ్యుజీషియన్ ఎడ్డీ వెడ్డర్ శ్రీదేవి, శశి కపూర్ కోసం పాట పాడి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..