నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2018 : శ్రీదేవి, వినోద్ ఖన్నా లకు అవార్డులు
- April 13, 2018
భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అద్భుతమైన నటుల్లో అందాల తార శ్రీదేవి, వినోద్ ఖన్నా ఒకరు. వీరిద్దరూ ఈ లోకంలో లేకపోయినా చిత్ర పరిశ్రమ, అభిమానుల గుండెల్లో మాత్రం చిరకాలం నిలిచిపోయేంతగా పేరు తెచ్చుకున్నారు. హఠాన్మరణంతో సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టిన శ్రీదేవికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించగా..అనారోగ్యంతో చనిపోయిన వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.
అయితే ఈ సారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 మంది ప్రముఖుల పేర్లను పరిశీలించింది. చివరికి అవార్డును వినోద్ ఖన్నాకు ఇవ్వాలని నిర్ణయించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో శ్రీదేవి నటించిన తొలి చిత్రం 'ఇంగ్లిష్ వింగ్లిష్'. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె తమిళంలో వచ్చిన 'పులి', భర్త బోనీ కపూర్ నిర్మించిన 'మామ్' చిత్రాల్లో నటించారు. 'మామ్' సినిమాలో శ్రీదేవి నటనకు గానూ జాతీయ అవార్డు లభించింది.
శ్రీదేవి ఉండుంటే బాగుండేది: బోనీ
శ్రీదేవికి జాతీయ అవార్డు రావడంతో బోనీ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తానిక్కడ ఉండి ఉంటే బాగుండేది. శ్రీదేవి అందుకున్న తొలి జాతీయ అవార్డు ఇది. చాలా విషయాలు గుర్తుకు వస్తున్నాయి.' అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఆస్కార్ సమయంలోనూ..!
ఇటీవల అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన 'ఆస్కార్' అవార్డుల వేడుకలోనూ శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు. అవార్డు కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రముఖ అమెరికన్ మ్యుజీషియన్ ఎడ్డీ వెడ్డర్ శ్రీదేవి, శశి కపూర్ కోసం పాట పాడి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







