గాజా సరిహద్దుల్లో రోజంతా కొనసాగిన ఘర్షణలు
- April 14, 2018
గాజా : ఇజ్రాయిల్, గాజా మధ్య సరిహద్దుల్లో పాలస్తీనా ప్రదర్శనకారులు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య శుక్రవారం రోజంతా జరిగిన ఘర్షణల్లో ఒక పాలస్తీనియుడు మరణించగా దాదాపు వెయ్యి మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ కెద్రా విలేకర్లతో మాట్లాడుతూ, గాజా నగరానికి చెందిన 28ఏళ్ళ ఇస్లామ్ హెర్జల్లా ఇజ్రాయిల్ తుపాకీ కాల్పుల్లో మరణించాడని తెలిపారు. గాయపడిన వారిలో పేరా మెడికల్ సిబ్బందితో పాటు ఏడుగురు స్థానిక జర్నలిస్టులు, కెమెరామెన్లు వున్నారని తెలిపారు. వీరిలో తుపాకీ గుళ్ళ వల్ల గాయపడిన వారు 170మంది వున్నారని చెప్పారు. ఇజ్రాయిల్తో తూర్పు గాజాలో గల సరిహద్దుకు సమీపంలో వేలాదిమంది పాలస్తీనియన్లు నిరసనల్లో పాల్గన్నారు. వీరితో ఇజ్రాయిల్ సైనికులు ఘర్షణలకు దిగారు. ఇజ్రాయిల్ సైనికుల తుపాకీ కాల్పుల నుండి రక్షణ కోసం ఆందోళనకారులు పెద్దసంఖ్యలో టైర్లను తగలబెట్టారు. దట్టంగా కమ్ముకున్న పొగను అడ్డం చేసుకుని వారు తమని తాము కాపాడుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయిలీ పతాకాలను దగ్ధం చేశారు. హమస్ ప్రతినిధి ఫజ్వి బర్హామ్ మాట్లాడుతూ, పాలస్తీనా భూమిని ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని అందుకే ఇజ్రాయిల్ పతాకాలను దగ్ధం చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









