ఫైనల్‌లో పరాజయం పాలైన కిదాంబి శ్రీకాంత్‌

- April 14, 2018 , by Maagulf
ఫైనల్‌లో పరాజయం పాలైన కిదాంబి శ్రీకాంత్‌

కామన్‌వెల్త్ బాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌లో పోరాడి ఓడాడు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌. మలేషియా ప్లేయర్‌ లీ చాంగ్‌ వితో జరిగిన మ్యాచ్‌లో 21-19, 14-21, 14-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడి మొదటి సెట్‌ను గెలుచుకున్న శ్రీకాంత్‌.. అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. రెండో సెట్‌లో పుంజుకున్న లీ చాంగ్‌.. మూడో సెట్‌లోనూ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను గెలిచాడు. కామన్‌వెల్త్‌లో గోల్డ్‌ను కొట్టాడు. ఫైనల్‌లో పరాజయం పాలైన శ్రీకాంత్‌కు రజత పతకం దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com