తెలంగాణ రాష్ట్రంలో సెగలు గక్కుతున్న భానుడు

- April 14, 2018 , by Maagulf
తెలంగాణ రాష్ట్రంలో సెగలు గక్కుతున్న భానుడు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువకావడంతో.. ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ల్‌ అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత 40.7, నిజామాబాద్‌లో 40, హైదరాబాద్‌లో 38 డిగ్రీలుగా నమోదైంది. ఉక్కపోతలు అధికమయ్యాయి. గాలిలో తేమ బాగా తగ్గుతోంది. నల్గొండలో సాధారణంగా 74 శాతం ఉండాల్సి ఉండగా..శనివారం 44 శాతముంది. ఉపరితల ద్రోణి వల్ల శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 41 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నారాయణఖేడ్‌లో 3 సెం.మీ కురిసింది. ఎండలు మరింత పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com