హెచ్-1 బి వీసాపై మోజు తగ్గిపోవటానికి గల కారణాలు
- April 14, 2018
హెచ్-1 బి వీసాపై మోజు తీరిపోతోందా?. అమెరికా వెళ్లాలనుకునేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందా?. అమెరికా అధ్యక్షుడు పెడుతున్న ఆంక్షలే అందుకు కారణమా?. అవుననే అంటున్నాయి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల లెక్కలు.
వరుసగా రెండో ఏడాది కూడా హెచ్-1బి వీసా కోసం అభ్యర్ధించే భారతీయుల సంఖ్య తగ్గింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అభ్యర్ధనల సంఖ్య 45 శాతం తగ్గిందని అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ సంస్థ వెల్లడించింది. 2017లో 3 లక్షల 99 వేల 349 అభ్యర్ధనలు రాగా.. ఇప్పుడు 3 లక్షల 36 వేల 107కు పడిపోయినట్లు వెల్లడించింది. 2018లో ఉద్యోగాలకు దాదాపు 1.90 లక్షల హెచ్-1బి వీసా దరఖాస్తులు అందినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.
2018-19 సంవత్సరం కోసం అక్టోబర్ 1 నుంచి వీసాలు జారీ చేయనున్నారు. ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే గతేడాదితో పోలిస్తే H1-B వీసాల కోసం 8 వేల 902 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ 2018-19 సంవత్సరానికి అభ్యర్ధనల కోటాను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనుంది.
హెచ్-1బి వీసా కోసం జనరల్ కోటాలో పరిమితి 65 వేలు కాగా.. అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్స్గా అభివర్ణించే మాస్టర్స్ క్యాప్ కోసం పరిమితి 20 వేలు. ఇలా వచ్చిన అభ్యర్థనల నుంచి కొందరి దరఖాస్తులను కంప్యూటర్ జనరేటెడ్ ర్యాండమ్ సెలక్షన్ పద్ధతిలో ఎంపిక జరగనుంది. ఇమ్మిగ్రేషన్ సంస్థ ప్రస్తుతం ఎంపిక కాని అభ్యర్ధనలను వారు కట్టిన ఫీజుతో పాటు తిప్పి పంపే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









