నన్ను రేప్ చేసి చంపేస్తారు: లాయర్
- April 15, 2018
కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా కథువా రేప్ కేసులో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధిత అసిఫా తరుపున వాదిస్తున్న లాయర్ దీపిక ఎస్ రాజావత్ తన ప్రాణాలకు హాని ఉన్నట్టు తెలిపింది. నేను ఎప్పటి వరకు బతికి ఉంటానో తెలియదు. నన్ను కూడా వాళ్ళు రేప్ చేసి చంపేస్తారు అని తెలిపింది. నా ప్రాణాలకు హాని ఉన్న విషయాన్ని నేడు సుప్రీం కోర్టుకు చెబుతా' అని దీపిక పేర్కొన్నారు.
తాజాగా లాయర్ దీపిక మాట్లాడుతూ.. కథువా కేసును వాదిస్తున్నందుకు జమ్ము బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఎస్ స్లాథియా హెచ్చరించినట్టు పేర్కొంది. జమ్ము బార్ అసోసియేషన్లో నేను సభ్యురాలిని కాను.. అయినా కూడా బుధవారం స్లాథియా ఈ కేసు నుంచి దూరంగా ఉండాలని నన్ను హెచ్చరించారు అని తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









