నన్ను రేప్ చేసి చంపేస్తారు: లాయర్
- April 15, 2018కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా కథువా రేప్ కేసులో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధిత అసిఫా తరుపున వాదిస్తున్న లాయర్ దీపిక ఎస్ రాజావత్ తన ప్రాణాలకు హాని ఉన్నట్టు తెలిపింది. నేను ఎప్పటి వరకు బతికి ఉంటానో తెలియదు. నన్ను కూడా వాళ్ళు రేప్ చేసి చంపేస్తారు అని తెలిపింది. నా ప్రాణాలకు హాని ఉన్న విషయాన్ని నేడు సుప్రీం కోర్టుకు చెబుతా' అని దీపిక పేర్కొన్నారు.
తాజాగా లాయర్ దీపిక మాట్లాడుతూ.. కథువా కేసును వాదిస్తున్నందుకు జమ్ము బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఎస్ స్లాథియా హెచ్చరించినట్టు పేర్కొంది. జమ్ము బార్ అసోసియేషన్లో నేను సభ్యురాలిని కాను.. అయినా కూడా బుధవారం స్లాథియా ఈ కేసు నుంచి దూరంగా ఉండాలని నన్ను హెచ్చరించారు అని తెలిపింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?