రిలీజ్కు ముందే రికార్డులు..
- April 16, 2018
ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అను నేను' చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. గతంలోని మహేష్ చిత్రాలకన్నా అమెరికాలోని ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సినిమా హిట్ అయితే మొదటి వారంలోని 3 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కొన్ని సైట్లలో అప్పుడే టిక్కెట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









