రీ ఎంట్రీకి 'డిస్కో శాంతి' రెడీ
- April 16, 2018
టాలీవుడ్ పై ఒక వెలుగు వెలుగు వెలిగిన డిస్కో శాంతి విలక్షణ నటుడు శ్రీహరితో వివాహమైన తర్వాత మూవీలకు దూరమైంది.. అయితే ఆకస్మికంగా శ్రీహరి మరణించడంతో మళ్లీ మూవీలలో నటించాలని అనుకుంటున్నది..రీ ఎంట్రీ పై డిస్కో శాంతి స్పందిస్తూ, " ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదుగానీ, తెలుగు తెరపై మళ్లీ నన్ను చూసే అవకాశాలు వున్నాయి. గుంపులో గోవింద అనిపించే పాత్రలు మాత్రం చేయను .. అంత అవసరం లేదు కూడా. ప్రాధాన్యత కలిగిన మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా వున్నాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు .. అందువలన ఇప్పుడు చేయవచ్చని అనుకుంటున్నాను. మళ్లీ నటన వైపుకు వెళ్లడం వలన నలుగురిని కలవడం .. మాట్లాడటం జరుగుతుంది. మనసుకి కాస్త ఊరట కలుగుతుందనే ఉద్దేశంతోనే అటుగా ఆలోచిస్తున్నాను" అని తెలిపింది..
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









