రీ ఎంట్రీకి 'డిస్కో శాంతి' రెడీ
- April 16, 2018టాలీవుడ్ పై ఒక వెలుగు వెలుగు వెలిగిన డిస్కో శాంతి విలక్షణ నటుడు శ్రీహరితో వివాహమైన తర్వాత మూవీలకు దూరమైంది.. అయితే ఆకస్మికంగా శ్రీహరి మరణించడంతో మళ్లీ మూవీలలో నటించాలని అనుకుంటున్నది..రీ ఎంట్రీ పై డిస్కో శాంతి స్పందిస్తూ, " ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదుగానీ, తెలుగు తెరపై మళ్లీ నన్ను చూసే అవకాశాలు వున్నాయి. గుంపులో గోవింద అనిపించే పాత్రలు మాత్రం చేయను .. అంత అవసరం లేదు కూడా. ప్రాధాన్యత కలిగిన మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా వున్నాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు .. అందువలన ఇప్పుడు చేయవచ్చని అనుకుంటున్నాను. మళ్లీ నటన వైపుకు వెళ్లడం వలన నలుగురిని కలవడం .. మాట్లాడటం జరుగుతుంది. మనసుకి కాస్త ఊరట కలుగుతుందనే ఉద్దేశంతోనే అటుగా ఆలోచిస్తున్నాను" అని తెలిపింది..
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం