రాత్రిపూట గల్లీ క్రికెట్ ఆడిన సచిన్
- April 16, 2018ముంబై: సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్కు 24 ఏళ్ల పాటు తన సేవలందించారు. తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి మార్గనిర్దేశనం చేస్తూ ఇంకా క్రికెట్తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా సచిన్ ముంబై గల్లీలో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయింది. సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్ చేశారు.
పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్ డివైడర్ని వాడారు. అంతర్జాతీయ క్రికెట్కు 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ తన ఐపీఎల్ కెరీర్లో 78 మ్యాచ్ల్లో 2,334 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత