స్వీడన్ చేరుకున్న మోడీ

- April 16, 2018 , by Maagulf
స్వీడన్ చేరుకున్న మోడీ

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం స్వీడన్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని స్టీఫన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. భారత్, స్వీడన్‌ దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించనున్నారు. అనంతరం ఇండియా-నార్డిక్‌ సదస్సులో పాల్గొంటారు. స్వీడన్‌ పర్యటన తర్వాత బ్రిటన్‌, జర్మనీలో ఈనెల 20 వరకు ప్రధాని పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com