‘మా’ వ్యవహారం పై మండిపడ్డ మంచు విష్ణు
- April 18, 2018శ్రీ రెడ్డి వ్యవహారంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుసరించిన వ్యవహార శైలిపై హీరో మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ రెడ్డిపై ఏ హక్కుతో ఆంక్షలు ఎందుకు విధించారని? తిరిగి ఎందుకు ఎత్తేశారని? ఆయన మా ను నిలదీశారు. ఈ మేరకు మా అధ్యక్షుడికి నేరుగా ఆయన ఓ లేఖ రాశారు.
‘మా’ను భ్రష్టు పట్టించకండి...
‘మా లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గందరగోళంగా ఉన్నాయి. సభ్యత్వం లేని ఆమె(శ్రీ రెడ్డిని ఉద్దేశించి...) చేసిన ఆరోపణల ఆధారంగా హడావుడిగా సమావేశం నిర్వహించి.. 900 సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా ఆమెతో నటించకూడదని మా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ 900 మంది సభ్యుల్లో మా నాన్న గారు, నా తమ్ముడు, నా సోదరి మరియు నేను కూడా ఉన్నాం. అంటే మమల్ని కూడా కలిపే చెప్పారా? ఎవరిని అడిగి ఆ ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ ఏదో పొడుచుకొచ్చినట్లు మీటింగ్ పెట్టి ఆ నిషేధం ఎత్తేశారు. ఈ నిర్ణయాలన్నీ మా పై వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణాలు అవుతున్నాయి. మీ చేష్టలతో ప్రజల్లో, మీడియాలో ‘మా’ చులకన అయిపోతోంది. దయచేసి మీ అనాలోచిత నిర్ణయాలతో మా ను భ్రష్టు పట్టించకండి’ అంటూ లేఖలో విష్ణు విమర్శలు సంధించారు.
మార్గదర్శకాలేవీ?
అసలు నటీనటులకు సరైన మార్గదర్శకాలేవీ? అని ‘మా’ను మంచు విష్ణు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్లకు కూడా ఆ మార్గదర్శకాలను అన్వయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మా లో సభ్యత్వం లేని చాలా మంది స్థానిక నటులు ఉన్నారని.. వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా? అంటూ విష్ణు నిలదీశారు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు టాలీవుడ్ పరువు తీసేస్తోందన్న విష్ణు.. గ్రీవియన్స్(అత్యవసర) సెల్ ఏర్పాటు బాధ్యతను మా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ తీసుకోవాలని కోరారు. ఈ లేఖపై ‘మా’ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన