భాగ్యనగరం లో సచిన్ సందడి
- April 19, 2018మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్లో సందడి చేశాడు. కెపిహెచ్బి ఫోరమ్ మాల్లో స్మాష్ గేమింగ్ జోన్ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నేషనల్ బౌలింగ్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశాడు. సచిన్ రాకతో మాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఒక దశలో అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు , నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో సచిన్ చాలాసేపు మాల్లో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకి రాలేకపోయాడు. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలని సచిన్ సూచించాడు. క్రికెట్టే కాకుండా ఏ క్రీడల్లోనైనా తమ పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదేనని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ