వైఎస్సార్ సతీమణిగా రమ్యకృష్ణ!
- April 19, 2018టాలీవుడ్లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ తారలైన మహానటి సావిత్రి, మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మొదటి సారిగా రాజకీయ నేతపై సినిమా తీస్తున్నారు. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర' సినిమాతో మళియాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనుందని.. విజయ్ చిల్లా.. దేవిరెడ్డి శశి ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్ర మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా..ఆయన సతీమణి పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
తాజాగా నయనతార ప్లేస్ లో బాహబలిలో శివగామిగా అద్భుత నటన ప్రదర్శించిన నటి రమ్యకృష్ణను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ప్రజలకు ఎన్నో ఉపాధి పథకాలు..అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారు..అందుకే ఆయన ప్రజా నాయకుడు అయ్యారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తు హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాశారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ సినిమాపై వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..