వివాహ వేడుకపై వైమానిక దాడి: 20మంది మృతి
- April 23, 2018దుబాయి: సౌదీ అరేబియాలోని యెమన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం. సౌదీ సైన్యం నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన ఈ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను హజ్జాలోని అల్ జుమ్హౌరీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి