హమస్ పోస్ట్పై ఇజ్రాయిల్ క్షిపణుల దాడి
- April 28, 2018ఇజ్రాయిల్ సైన్యం హమస్ పోస్ట్పై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ గాజా నగరంలో జాలర్ల హార్బర్కు సమీపంలో గల హమస్ స్థావరంపై జరిగిన ఈ దాడిలో భవనం, రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇజ్రాయిల్ సైన్యం కూడా వెంటనే స్పందించలేదు. మార్చి 30వ తేది నుండి ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గాజా నగరంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తూర్పు గాజాలో శుక్రవారం వందలాదిమంది పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 800మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు