దుబాయ్:కారం చల్లి దొంగతనం చేసిన ఇద్దరు దొంగలకు ఏడాది జైలు
- May 05, 2018
దుబాయ్:200,000 దిర్హామ్లు దోచుకున్న ఇద్దరు దొంగలకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్టేషన్ చేయనున్నారు. గత ఏడాది జులై 31న కంపెనీ నుంచి బయటకు వెళుతున్న ఓ భారత జాతీయుడ్ని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అతని మీద ఓ లిక్విడ్ని వారు పోశారు. దాంతో కళ్ళు మంటలతో బాధితుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే నిందితులు అతని దగ్గరున్న డబ్బుని దోచుకెళ్ళిపోయారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మొత్తం ముగ్గురు నిందితులు కాగా, అందులో ఒకరు ఇంకా పరారీలోనే వున్నారు. మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







