దుబాయ్:కారం చల్లి దొంగతనం చేసిన ఇద్దరు దొంగలకు ఏడాది జైలు
- May 05, 2018
దుబాయ్:200,000 దిర్హామ్లు దోచుకున్న ఇద్దరు దొంగలకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్టేషన్ చేయనున్నారు. గత ఏడాది జులై 31న కంపెనీ నుంచి బయటకు వెళుతున్న ఓ భారత జాతీయుడ్ని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అతని మీద ఓ లిక్విడ్ని వారు పోశారు. దాంతో కళ్ళు మంటలతో బాధితుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ క్రమంలోనే నిందితులు అతని దగ్గరున్న డబ్బుని దోచుకెళ్ళిపోయారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మొత్తం ముగ్గురు నిందితులు కాగా, అందులో ఒకరు ఇంకా పరారీలోనే వున్నారు. మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









