ఎంఐటీ కి సలదారునిగా హీరో అజిత్.!
- May 05, 2018
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతగొప్ప పేరు సంపాదించిన హీరో అజిత్ కుమార్. తెలుగు వాడైన అజిత్ కుమార్ తెలంగాణాలోని సికింద్రాబాబ్ లో పుట్టి పెరిగాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.
స్టార్ హీరో అజిత్కి సినిమాలపైనే కాకుండా బైక్, కారు రేస్, ఫోటోగ్రఫీపై ఎక్కువ ఇంట్రెస్ట్. కొన్ని రోజులుగా ఆయన చిన్న విమానాలు, హెలికాఫ్టర్స్ని తయారుచేస్తున్నారు. రీసెంట్గా డ్రోన్ల తయారీపై కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు. ఇటీవల దీనిపై అధ్యయనం చేయడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి వెళ్లి అక్కడి విద్యార్థులతోనూ ముచ్చటించారు.
కాగా అజిత్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో తనదైన ప్రతిభ చూపిస్తున్నారు. కాగా, అజిత్ లోని ప్రతిభని గుర్తించిన ఎంఐటీ ఆయనని 'హెలికాప్టర్ టెస్ట్ ఫైలట్ అండ్ యూఏవీ సిస్టం' సలహాదారుడిగా నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపును తెచ్చుకున్న తొలి నటుడు అజిత్ కావడం విశేషం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







