దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ
- May 06, 2018
దర్శకరత్న దాసరి నారాయణరావు బర్త్ డేని డైరెక్టర్స్ రోజుగా నిర్ణయించడం ఎంతో సంతోషంగా వుందన్నారు నటుడు బాలకృష్ణ. దాసరి జయంతి సందర్భంగా శుక్రవారం ఫిల్మ్ఛాంబర్లో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఛాంబర్ ఆవరణలో నిలువెత్తు దాసరి విగ్రహాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. దాసరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దాసరి.. తలలో నాలుకలా ఉంటూ ఇండస్ట్రీ కష్టాలను తన కుటుంబ కష్టాలుగా భావించి వాటిని తన భుజాలపై మోసి పరిష్కరించారని కొనియాడారు. జాతీయ, ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు ఇలా ఎన్నో వచ్చాయికానీ, ఆ అవార్డులన్నీ ఆయన ముందు దిగదుడుపే అని తెలియజేశారు.
ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తని, దాసరి డైరెక్షన్లో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నానని తెలిపిన బాలకృష్ణ.. ఆయన 150వ చిత్రం 'పరమవీర చక్ర' ఫిల్మ్లో అనుకోకుండా నటించానని తెలిపారు. 'శివరంజని' చిత్రానికి హీరోగా తనను తీసుకోవాలని భావించి ఎన్టీఆర్ని దాసరి అడిగారని, బాబు చదువు తర్వాత చేయవచ్చన్న విషయాన్ని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









