దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ
- May 06, 2018
దర్శకరత్న దాసరి నారాయణరావు బర్త్ డేని డైరెక్టర్స్ రోజుగా నిర్ణయించడం ఎంతో సంతోషంగా వుందన్నారు నటుడు బాలకృష్ణ. దాసరి జయంతి సందర్భంగా శుక్రవారం ఫిల్మ్ఛాంబర్లో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఛాంబర్ ఆవరణలో నిలువెత్తు దాసరి విగ్రహాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. దాసరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దాసరి.. తలలో నాలుకలా ఉంటూ ఇండస్ట్రీ కష్టాలను తన కుటుంబ కష్టాలుగా భావించి వాటిని తన భుజాలపై మోసి పరిష్కరించారని కొనియాడారు. జాతీయ, ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు ఇలా ఎన్నో వచ్చాయికానీ, ఆ అవార్డులన్నీ ఆయన ముందు దిగదుడుపే అని తెలియజేశారు.
ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తని, దాసరి డైరెక్షన్లో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నానని తెలిపిన బాలకృష్ణ.. ఆయన 150వ చిత్రం 'పరమవీర చక్ర' ఫిల్మ్లో అనుకోకుండా నటించానని తెలిపారు. 'శివరంజని' చిత్రానికి హీరోగా తనను తీసుకోవాలని భావించి ఎన్టీఆర్ని దాసరి అడిగారని, బాబు చదువు తర్వాత చేయవచ్చన్న విషయాన్ని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







