తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు

- May 06, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు

రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు అంటూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. జనసేన సాంస్కృతిక విభాగంను బలోపేతం చేసేందుకు ఆసక్తి ఉన్న కవులు, కళాకారులు ఈ విభాగంలో చేరాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ''ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కవులు, గాయకులు, నృత్యకారులు మొదలగు కళాకారులు తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు దోహదపడే వేదికలపై ప్రదర్శించే సదావకాశాన్ని జనసేన పార్టీ కల్పించనుంది. జనసేన సాంస్కృతిక బృందంలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న కళాకారులను జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది..'' అంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com