తెలంగాణ:హృదయ విదారక ఘటన..
- May 06, 2018
తెలంగాణ:అల్లారు ముద్దుగా చూసుకున్న కుమార్తె మరణించిందని భార్య భర్తలు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో కుమారుడు అనాధ అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సందీప్ (31) పూజ(26) భార్య భర్తలు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. సందీప్ ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు. తిరిగి ఫ్యామిలీని తీసుకుని గల్ఫ్ వెళ్లాలనుకునే సమయానికి కుమార్తె అనారోగ్యంతో మరణించింది. దీంతో భార్య భర్తలిద్దరూ విషాదంలో మునిగిపోయారు. కుమార్తె మరణాన్ని జీర్నచుకోలేని సందీప్, పూజ అప్పటినుంచి ఎవ్వరు చెప్పిన వినకుండా కుమార్తె సమాధి వద్దకు వెళ్లి ఏడ్చేవారు. ఈ క్రమంలో అన్నంతినడం మానేయడంతో అస్వస్థకు గురయ్యారు. వీరిని ఇలాగె వదిలేస్తే ఏమైపోతారోనన్న బెంగతో సందీప్ బంధువు ఒకరు వారిని తన ఇంటికి రమ్మని కోరాడు. అయితే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి తలుపులు వేసుకున్నారు దంపతులు. వారిద్దరూ ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపు తెరిచాడు బంధువు. లోపల సందీప్, పూజ లిద్దరు వురికి వేలాడుతూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో షాక్ కు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుమార్తె మృతి చెందిందన్నబాధతో వారు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కాగా దంపతుల మరణంతో కుమారుడు అనాధగా మారాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..