తెలంగాణ:హృదయ విదారక ఘటన..
- May 06, 2018
తెలంగాణ:అల్లారు ముద్దుగా చూసుకున్న కుమార్తె మరణించిందని భార్య భర్తలు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో కుమారుడు అనాధ అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సందీప్ (31) పూజ(26) భార్య భర్తలు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. సందీప్ ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు. తిరిగి ఫ్యామిలీని తీసుకుని గల్ఫ్ వెళ్లాలనుకునే సమయానికి కుమార్తె అనారోగ్యంతో మరణించింది. దీంతో భార్య భర్తలిద్దరూ విషాదంలో మునిగిపోయారు. కుమార్తె మరణాన్ని జీర్నచుకోలేని సందీప్, పూజ అప్పటినుంచి ఎవ్వరు చెప్పిన వినకుండా కుమార్తె సమాధి వద్దకు వెళ్లి ఏడ్చేవారు. ఈ క్రమంలో అన్నంతినడం మానేయడంతో అస్వస్థకు గురయ్యారు. వీరిని ఇలాగె వదిలేస్తే ఏమైపోతారోనన్న బెంగతో సందీప్ బంధువు ఒకరు వారిని తన ఇంటికి రమ్మని కోరాడు. అయితే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి తలుపులు వేసుకున్నారు దంపతులు. వారిద్దరూ ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపు తెరిచాడు బంధువు. లోపల సందీప్, పూజ లిద్దరు వురికి వేలాడుతూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో షాక్ కు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుమార్తె మృతి చెందిందన్నబాధతో వారు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కాగా దంపతుల మరణంతో కుమారుడు అనాధగా మారాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







