బిడ్డ ప్రాణం తీసిన అమ్మ హైహీల్స్..
- May 07, 2018
హైహీల్స్ వేసుకుంటే అడుగులు తడబడతాయి. మామూలుగా నడవడమే కష్టం అనుకుంటే చంకలో పిల్లాడిని ఎత్తుకుని మరీ హైహీల్స్ వేసుకుని పెళ్లికి వెళ్లింది ఓ తల్లి. పట్టు తప్పి పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబైలోని ఉల్హాస్ నగర్ ఏరియాలో మహ్మద్ షేక్ కుటుంబం బంధువుల ఇంట్లో పెళ్లికని వెళ్లారు. కుటుంబంలోని ఫెమిదా షేక్ పెళ్లిలో అటూ ఇటూ తిరిగింది సందడి చేసింది. పెళ్లి కూడా అయిపోయింది. తిరిగి వెళదామని వస్తోంది. నడకలో బ్యాలెన్స్ తప్పింది. చంకలో ఉన్న బిడ్డ కాస్తా జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ పసివాడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు నిర్థారించారు. హైహీల్స్ కారణంగానే బిడ్డను కోల్పోయానని తల్లి ఫెమిదా కన్నీరు మున్నీరవుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







