బిడ్డ ప్రాణం తీసిన అమ్మ హైహీల్స్..
- May 07, 2018
హైహీల్స్ వేసుకుంటే అడుగులు తడబడతాయి. మామూలుగా నడవడమే కష్టం అనుకుంటే చంకలో పిల్లాడిని ఎత్తుకుని మరీ హైహీల్స్ వేసుకుని పెళ్లికి వెళ్లింది ఓ తల్లి. పట్టు తప్పి పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబైలోని ఉల్హాస్ నగర్ ఏరియాలో మహ్మద్ షేక్ కుటుంబం బంధువుల ఇంట్లో పెళ్లికని వెళ్లారు. కుటుంబంలోని ఫెమిదా షేక్ పెళ్లిలో అటూ ఇటూ తిరిగింది సందడి చేసింది. పెళ్లి కూడా అయిపోయింది. తిరిగి వెళదామని వస్తోంది. నడకలో బ్యాలెన్స్ తప్పింది. చంకలో ఉన్న బిడ్డ కాస్తా జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ పసివాడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు నిర్థారించారు. హైహీల్స్ కారణంగానే బిడ్డను కోల్పోయానని తల్లి ఫెమిదా కన్నీరు మున్నీరవుతోంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







