బిడ్డ ప్రాణం తీసిన అమ్మ హైహీల్స్..
- May 07, 2018
హైహీల్స్ వేసుకుంటే అడుగులు తడబడతాయి. మామూలుగా నడవడమే కష్టం అనుకుంటే చంకలో పిల్లాడిని ఎత్తుకుని మరీ హైహీల్స్ వేసుకుని పెళ్లికి వెళ్లింది ఓ తల్లి. పట్టు తప్పి పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబైలోని ఉల్హాస్ నగర్ ఏరియాలో మహ్మద్ షేక్ కుటుంబం బంధువుల ఇంట్లో పెళ్లికని వెళ్లారు. కుటుంబంలోని ఫెమిదా షేక్ పెళ్లిలో అటూ ఇటూ తిరిగింది సందడి చేసింది. పెళ్లి కూడా అయిపోయింది. తిరిగి వెళదామని వస్తోంది. నడకలో బ్యాలెన్స్ తప్పింది. చంకలో ఉన్న బిడ్డ కాస్తా జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ పసివాడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు నిర్థారించారు. హైహీల్స్ కారణంగానే బిడ్డను కోల్పోయానని తల్లి ఫెమిదా కన్నీరు మున్నీరవుతోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









