కిండర్గార్టెన్లో అగ్ని ప్రమాదం: 176 మంది చిన్నారులు క్షేమం
- May 07, 2018
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ పైటర్స్ అత్యంత చాకచక్యంగా అగ్ని ప్రమాదం నుంచి 176 మంది చిన్నారుల్ని రక్షించారు. అల్ వురూద్ కిండర్గార్టెన్లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందుకోగానే, సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దహాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 20 మంది టీచర్లు, 176 మంది విద్యార్థులు ఆ కిండర్గార్టెన్లో వున్నారని సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అలి అల్ మహబూబి చెప్పారు. నీటిని అలాగే ఫోమ్ని ఉపయోగించి మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థులంతా క్షేమమని అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..