అమర్నాథ్ యాత్రలో విషాదం
- May 08, 2018
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీగా మంచు తుఫాన్ కారణంగా ముగ్గురు మృతి చెందారు.ముంబయికి చెందిన 52 ఏళ్ల సుధామా సింగ్, న్యూఢిల్లీకి చెందిన జానకీ దేవి మృతదేహాలు నేపాల్ సరిహద్దుల్లోని ఆకాష్ వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరకాశిలోని కేదార్టాల సమీపంలో ఒక ప్రాంతంలో చిక్కుకున్న ఓ కూలీ మరణించారు. భారీ హిమపాతంతో అమర్నాథ్ పుణ్యకేత్రానికి సందర్శిచడానికి వెళ్లిన మాజీ సిఎం హరీష్ రావత్, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ తమ్టాతో కేథారీనాథ్, యమునోత్రి ఆలయాల్లో చిక్కుకోగా, అనేక మంది పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగేష్ గిల్డియల్ మాట్లాడుతూ యాత్రికులకు రాష్ట్ర విపత్తు స్పందన ఫండ్, స్థానిక పోలీసులు, పరిపాలన నుండి స్వచ్ఛంద సేవకులు సహాయపడుతున్నారన్నారు. బద్రీనాథ్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం వాసులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం క్షేమంగా తరలించిందని జెడ్పిటిసి శ్రీదేవి మధు బాబులు ప్రజాశక్తికి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







