ఇరాన్తో అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం
- May 08, 2018
ఇరాన్తో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ డీల్ లోపభూయిష్టమైనదని, కాలం చెల్లినదని వ్యాఖ్యానించారు. అమెరికా పౌరుడిగా ఈ ఒప్పందం తనకు నగుబాటు అని చెప్పారు.
ఇరాన్ ఒప్పందం నుంచి తప్పుకోవద్దన్న యూరప్లోని అమెరికా మిత్రదేశాల సలహాను పక్కనబెడుతూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. అణు ఒప్పందం కుదిరినప్పుడు ఇరాన్పై ఎత్తివేసిన ఆర్థిక ఆంక్షలను తిరిగి విధిస్తానని ఆయన చెప్పారు.
ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ వెంటనే స్పందించింది.
ఒప్పందం రూపంలో అమెరికా తమకు మాట ఇచ్చిందని, తాజా నిర్ణయంతో ఈ మాటను అమెరికా తప్పుతోందని ఇరాన్ వ్యాఖ్యానించింది.
అవసరమైతే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు.
అణు ఇంధనంతోపాటు అణ్వాయుధాల తయారీకి యురేనియం శుద్ధి కీలకం.
అణు ఒప్పందంలో భాగస్వాములైన తమ మిత్రదేశాలు, ఇతర దేశాలతో చర్చిస్తామని, వాటి సహకారంతో ఒప్పందం లక్ష్యాలు నెరవేరే పక్షంలో ఒప్పందంలో కొనసాగుతామని రౌహానీ చెప్పారు. కొన్ని వారాల్లో ఈ చర్చలు జరుపుతామని, ఆ తర్వాత ఒప్పందంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్(జేసీపీవోఏ)'గా వ్యవహరించే ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు కుదిరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







