దుబాయ్ లో ఫేక్ క్యాష్ ప్రైజ్ రాకెట్: 14 మంది అరెస్ట్
- May 12, 2018
దుబాయ్:దుబాయ్ పోలీసులు 14 మంది సభ్యులుగల ఓ ముఠాని అరెస్ట్ చేశారు. ప్రముఖ స్టోర్స్ పేరుతో మెసేజ్లు పంపి, బహుమతులు గెలిచారంటూ అమాయకుల్ని నమ్మించి, మోసానికి పాల్పడుతున్నట్లు ముఠా సభ్యులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ముఠా గురించిన సమాచారం అందుకున్న యాంటీ ఎకనమిక్ క్రైమ్స్ టీమ్, ఏప్రిల్ 30న రంగంలోకి దిగింది. హోర్ అల్ అన్జ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్పై దాడి చేసి, ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసింది. వీరి నుంచి 90 ఫోన్లు, పెద్ద మొత్తంలో నగదు, ఇల్లీగల్ లోకల్ కాలింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాంటీ ఎకనమిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ బిన్ హమ్మాద్ మాట్లాడుతూ, నిందితులంతా విజిట్ వీసాపై దేశంలోకి వచ్చారనీ, ఓ వ్యక్తి అరబిక్ స్పష్టంగా మాట్లాడతాడనీ, అతడే మాస్టర్ మైండ్ అనీ చెప్పారు. ఫేక్ క్యాష్ ప్రైజ్ పేరుతో జరిగే అక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని కల్నల్ ఒమర్ బిన్ మహ్మద్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







