దుబాయ్ లో ఫేక్ క్యాష్ ప్రైజ్ రాకెట్: 14 మంది అరెస్ట్
- May 12, 2018
దుబాయ్:దుబాయ్ పోలీసులు 14 మంది సభ్యులుగల ఓ ముఠాని అరెస్ట్ చేశారు. ప్రముఖ స్టోర్స్ పేరుతో మెసేజ్లు పంపి, బహుమతులు గెలిచారంటూ అమాయకుల్ని నమ్మించి, మోసానికి పాల్పడుతున్నట్లు ముఠా సభ్యులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ముఠా గురించిన సమాచారం అందుకున్న యాంటీ ఎకనమిక్ క్రైమ్స్ టీమ్, ఏప్రిల్ 30న రంగంలోకి దిగింది. హోర్ అల్ అన్జ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్పై దాడి చేసి, ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసింది. వీరి నుంచి 90 ఫోన్లు, పెద్ద మొత్తంలో నగదు, ఇల్లీగల్ లోకల్ కాలింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాంటీ ఎకనమిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ బిన్ హమ్మాద్ మాట్లాడుతూ, నిందితులంతా విజిట్ వీసాపై దేశంలోకి వచ్చారనీ, ఓ వ్యక్తి అరబిక్ స్పష్టంగా మాట్లాడతాడనీ, అతడే మాస్టర్ మైండ్ అనీ చెప్పారు. ఫేక్ క్యాష్ ప్రైజ్ పేరుతో జరిగే అక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని కల్నల్ ఒమర్ బిన్ మహ్మద్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







