పారిస్ లో ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- May 12, 2018
హైదరాబాద్ : పారిస్లో మరో ఉగ్రదాడి జరిగింది. కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సెంట్రల్ పారిస్లో శనివారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదిని కాల్చిచంపారు.
బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లతో నిండి ఉండే నగరంలోని ఒపేరా హౌస్ ప్రాంతంలో ఉగ్రవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనాలు వీకెండ్ నైట్ ఉత్సాహంలో ఉండగా దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ లో మరోమారు రక్తం చిందిందని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది తమ సైనికుడేనని ఐసిస్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







