పారిస్ లో ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- May 12, 2018
హైదరాబాద్ : పారిస్లో మరో ఉగ్రదాడి జరిగింది. కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సెంట్రల్ పారిస్లో శనివారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదిని కాల్చిచంపారు.
బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లతో నిండి ఉండే నగరంలోని ఒపేరా హౌస్ ప్రాంతంలో ఉగ్రవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనాలు వీకెండ్ నైట్ ఉత్సాహంలో ఉండగా దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ లో మరోమారు రక్తం చిందిందని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది తమ సైనికుడేనని ఐసిస్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..