పారిస్ లో ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- May 12, 2018
హైదరాబాద్ : పారిస్లో మరో ఉగ్రదాడి జరిగింది. కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సెంట్రల్ పారిస్లో శనివారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదిని కాల్చిచంపారు.
బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లతో నిండి ఉండే నగరంలోని ఒపేరా హౌస్ ప్రాంతంలో ఉగ్రవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనాలు వీకెండ్ నైట్ ఉత్సాహంలో ఉండగా దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ లో మరోమారు రక్తం చిందిందని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది తమ సైనికుడేనని ఐసిస్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







