ఇండోనేషియాలో ఆత్మహుతి దాడి
- May 12, 2018
జకార్తా : ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులోని సురాబయా నగరంలోని శాంటా మారియా తక్ బెర్సెల చర్చి వద్ద ఆదివారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరు చర్చికి చెందిన సభ్యుడు కాగా, మరొకరు నిందితుడని తూర్పు జావా పోలీస్ అధికార ప్రతినిధి ఫ్రాన్స్ బరుంగ్ మంగేరా తెలిపారు. ఇది ఆత్మహుతి దాడి అని పేర్కొన్నారు. సుమారు మూడు చర్చిల్లో ఇటువంటి దాడులు జరిగాయని తూర్పు జావా పోలీసులు తెలిపారు. మిగతా రెండు చర్చిల్లో మరణాల సంఖ్య తెలియరాలేదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు మొదటి బాంబు పేలుడు జరిగిందని, 10 నిమిషాల్లోనే అన్ని చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయని తెలిపారు. దీంతో ఆ శాంటా మేరియా టాక్ బెర్సల చర్చి ప్రాంతం చుట్టూ భద్రతా సిబ్బందిని నియమించామని, బాంబు స్వ్కాడ్ను కూడా ఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. బాధితులను గుర్తిస్తున్నామని, నాల్గవ చర్చిలో కూడా దాడులు జరిగాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







