కంపెనీలకు మిడ్‌ డే బ్రేక్‌ జారీ చేసిన ఒమన్‌ కామర్స్‌ ఛాంబర్‌

- May 15, 2018 , by Maagulf
కంపెనీలకు మిడ్‌ డే బ్రేక్‌ జారీ చేసిన ఒమన్‌ కామర్స్‌ ఛాంబర్‌

మస్కట్‌: కార్మికులు అత్యధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు ఎలాంటి పనీ చేయకూడదంటూ ఒమన్స్‌ కామర్స్‌ రెగ్యులేటరీ అథారిటీ కంపెనీలను హెచ్చరించింది. కన్‌స్ట్రక్షన్‌ సైట్స్‌లో బయట పనిచేసేవారికి ఇది వర్తిస్తుంది. ఆర్టికల్‌ 16 - రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ ప్రకారం జూన్‌, జులై ఆగస్ట్‌లలో ప్రతి యేడాదీ కార్మికులకు మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు పనిచేయకుండా బ్రేక్‌ ఇవ్వాల్సి వుంటుంది. గత వారం రోజులుగా సుల్తానేట్‌ పరిధిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి వస్తోన్న వేడి గాలుల కారణంగా మస్కట్‌లో వేడి మరింత తీవ్రతరమవుతున్నట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారి తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com