అశోక్‌గజపతి రాజు చెన్నై విమానాశ్రయాన్ని సందర్శించారు

- December 07, 2015 , by Maagulf
అశోక్‌గజపతి రాజు చెన్నై విమానాశ్రయాన్ని సందర్శించారు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు ఇవాళ చెన్నై విమానాశ్రయాన్ని సందర్శించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విమానాశ్రయ పరిసరాలను పరిశీలించారు. విమానాశ్రయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఎయిర్‌పోర్టుకు సంభవించిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం తమిళనాడు సీఎం జయలలితతో భేటీ కానున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వర్షపు నీటిలో మునిగి పోయిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com