ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు ఏపీ విద్యార్ధులు

- May 17, 2018 , by Maagulf
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు ఏపీ విద్యార్ధులు

అమరావతి: ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి చెందిన జె. ప్రవీణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాశ్, విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి. రాజు, నెల్లూరు జిల్లా చిట్టేడు గ్రామానికి చెందిన వెంకటేశ్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన ప్రసన్న అనే విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ విద్యార్ధులకు గత రెండు సంవత్సరాలుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కాగా... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులకు ప్రభుత్వ యంత్రాంగం అభినందనలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com