ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు ఏపీ విద్యార్ధులు
- May 17, 2018
అమరావతి: ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి చెందిన జె. ప్రవీణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాశ్, విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి. రాజు, నెల్లూరు జిల్లా చిట్టేడు గ్రామానికి చెందిన వెంకటేశ్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన ప్రసన్న అనే విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ విద్యార్ధులకు గత రెండు సంవత్సరాలుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కాగా... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులకు ప్రభుత్వ యంత్రాంగం అభినందనలు తెలిపింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







