బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి .!
- May 19, 2018
4 రోజుల్లో అనేక మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయాలు చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయగానే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. వెంటనే జేడీఎస్ నేత కుమారస్వామి రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్కు తెలిపారు. వెంటనే గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ఆహ్వానించారు. దీంతో సోమవారం తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కుమార స్వామి ప్రకటించారు. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాతో తెలిపారు. కాని.. తాజాగా ప్రమాణ స్వీకారాన్ని సోమవారం కాకుండా బుధవారానికి అంటే మే 23 కు వాయిదా వేస్తున్నట్లు జేడీఎస్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12.30కు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ తెలిపింది. సోమవారం(మే 21)న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కాబట్టి ఆ రోజును మార్చినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







