తమిళనాడులో పోలీసు కాల్పులు
- May 22, 2018చెన్నై: తమిళనాడు తూత్తకూడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని చేపట్టిన ఆందోళనలో తొమ్మిది మంది నిరసనకారులు మృతిచెందారు. కొన్ని నెలలుగా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ర్యాలీ సందర్భంగా ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ స్థానిక చర్చి వద్ద గుమిగూడిన నిరసనకారులు తొలుత కర్మాగారం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ను ముట్టడించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పటించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అయినా వారు శాంతించకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మృతిచెందారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు: మంత్రి ఆందోళనకారులు కలెక్టరేట్లోకి ప్రవేశించి హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని తమిళనాడు మంత్రి జయకుమార్ వెల్లడించారు. సీఎం పళనిస్వామి అధికారులతో మాట్లాడారని తెలిపారు. తూత్తుకూడిలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు పక్కనే ఉన్న జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు.
కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెన్నై నుంచి తూత్తుకూడికి చేరుకున్నారు. పోలీసు కాల్పులను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
తాజా వార్తలు
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..