ట్రాఫిక్ కెమెరాలు చూస్తున్నాయ్ జాగ్రత్త
- December 07, 2015
వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మొబైల్ ఫోన్ని వినియోగించినా దుబాయ్లో ట్రాఫిక్ కెమెరాలు పసిగట్టేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలను దుబాయ్లో ఇన్స్టాల్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతధికారులు వెల్లడించారు. గడచిన 11 నెలల్లో సుమారు51,891 కేసుల్ని గుర్తించామనీ, వీటిల్లో సీట్ బెల్ట్, మొబైల్ ఫోన్ అఫెన్సెస్ ఉన్నాయని కల్నల్ సైఫ్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఇల్లీగల్ ఓవర్టేకింగ్,రాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్నీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తించామని ఆయన అన్నారు. వాహనం ఎంత వేగంతో వెళ్ళినా,పసిగట్టగలిగే విధంగా కొత్త టెక్నాలజీతో కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనదారులు కెమెరాలను గుర్తించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. షేక్ జాయెద్ రోడ్లో 51 అధునాతన కెమెరాలను అమర్చగా, ప్రధాన కూడళ్ళ వద్ద 31కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







