ముగ్గురు వలసదారులపై ఫ్రాడ్ అభియోగాలు
- May 23, 2018మస్కట్: ముగ్గురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఓ పౌరుడ్ని మోసం చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఒమనీ రియాల్స్ని డాలర్లలోకి మార్చడం ద్వారా డబ్బుని డబుల్ చేస్తామంటూ నిందితులు, బాధితుడ్ని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. సీబ్ పోలీస్ స్టేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్రికా జాతీయులైన ముగ్గురు వ్యక్తుల్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేయగలిగింది. బాధితుడు, మోసగాళ్ళకు 12,000 ఒమన్ రియాల్స్ ఇచ్చాడు. దానికి ప్రతిగా, ఓ బాక్స్ని నిందితులు, బాధితుడికి ఇచ్చారు. అందులో డాలర్లు వున్నాయని నమ్మబలికారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళిపోగా, బాక్స్ తెరిచిన బాధితుడికి అందులో నల్లటి కాగితాలు మాత్రమే కన్పించాయి. అరెస్టయిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు