ముగ్గురు వలసదారులపై ఫ్రాడ్‌ అభియోగాలు

- May 23, 2018 , by Maagulf
ముగ్గురు వలసదారులపై ఫ్రాడ్‌ అభియోగాలు

మస్కట్‌: ముగ్గురు వలసదారుల్ని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అరెస్ట్‌ చేయడం జరిగింది. ఓ పౌరుడ్ని మోసం చేసిన కేసులో వీరిని అరెస్ట్‌ చేశారు. ఒమనీ రియాల్స్‌ని డాలర్లలోకి మార్చడం ద్వారా డబ్బుని డబుల్‌ చేస్తామంటూ నిందితులు, బాధితుడ్ని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. సీబ్‌ పోలీస్‌ స్టేషన్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్రికా జాతీయులైన ముగ్గురు వ్యక్తుల్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్‌ చేయగలిగింది. బాధితుడు, మోసగాళ్ళకు 12,000 ఒమన్‌ రియాల్స్‌ ఇచ్చాడు. దానికి ప్రతిగా, ఓ బాక్స్‌ని నిందితులు, బాధితుడికి ఇచ్చారు. అందులో డాలర్లు వున్నాయని నమ్మబలికారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళిపోగా, బాక్స్‌ తెరిచిన బాధితుడికి అందులో నల్లటి కాగితాలు మాత్రమే కన్పించాయి. అరెస్టయిన నిందితుల్ని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com