ముగ్గురు వలసదారులపై ఫ్రాడ్ అభియోగాలు
- May 23, 2018
మస్కట్: ముగ్గురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఓ పౌరుడ్ని మోసం చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఒమనీ రియాల్స్ని డాలర్లలోకి మార్చడం ద్వారా డబ్బుని డబుల్ చేస్తామంటూ నిందితులు, బాధితుడ్ని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. సీబ్ పోలీస్ స్టేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్రికా జాతీయులైన ముగ్గురు వ్యక్తుల్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేయగలిగింది. బాధితుడు, మోసగాళ్ళకు 12,000 ఒమన్ రియాల్స్ ఇచ్చాడు. దానికి ప్రతిగా, ఓ బాక్స్ని నిందితులు, బాధితుడికి ఇచ్చారు. అందులో డాలర్లు వున్నాయని నమ్మబలికారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళిపోగా, బాక్స్ తెరిచిన బాధితుడికి అందులో నల్లటి కాగితాలు మాత్రమే కన్పించాయి. అరెస్టయిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..