ఫేక్ బాంబ్: అన్నదమ్ములకు జైలు
- May 25, 2018మనామా: హై క్రిమినల్ కోర్ట్ ఇద్దరు అన్నదమ్ములకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఫేక్ బాంబ్ని ప్లాంట్ చేయడం ద్వారా పబ్లిక్ పీస్ని దెబ్బతీసేందుకు వీరు ప్రయత్నించినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. జైలు శిక్షతోపాటు, వీరి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరిపై తీవ్రవాద నేరాభియోగాలు మోపబడ్డాయి. రద్దీగా వుండే ప్రాంతంలో బాంబుని పోలి వుండే వస్తువుని వీరు వుంచగా, భయపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాంబ్ ఎక్స్పర్ట్స్తో ఆ వస్తువుని పరీక్షింపజేసి, దాన్ని ఫేక్ బాంబుగా తేల్చారు. ఆ వస్తువు నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించగా, అవి నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో సరిపోయాయి. ఈ కేసులో ఇంకో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..