ఆ నాలుగు దేశాలతో సంబందాలు తెంచుకున్న ఖతార్
- May 27, 2018
సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకుని ఏడాది పూర్తవుతోంది. తాజాగా ఖతార్, ఆ నాలుగు దేశాలతో సంబంధాల్ని పూర్తిగా తెంచేసుకునే క్రమంలో ఆయా దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల్ని విక్రయించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఖతార్ ఎకానమీ మినిస్ట్రీ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. బ్యాన్ చేయబడిన దేశాలకు చెందిన వస్తువుల్ని గుర్తించేందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి. తీవ్రవాదానికి మద్దతిస్తోందంటూ ఖతార్పై గత జూన్ 5న సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ తెగతెంపులు చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కువైట్, ఒమన్ నుంచి ఇంపోర్ట్ రూట్స్ని ఏర్పాటు చేసుకుంది ఖతార్. అలాగే ఇరాన్, టర్కీల నుంచి గూడ్స్ని కొనుగోలు చేస్తోంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







