మానసరోవర్ యాత్రికులకు ఊరట
- May 29, 2018
మానస సరోవర్ యాత్రికులను పవిత్ర మానస సరోవరంలో స్నానాలు చేయకుండా చైనా అధికారులు అడ్డుకున్న వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. నిర్దిష్ట ప్రాంతాల్లో పవిత్ర స్నానాలకు తమను అనుమతించినట్టు భారత్ నుంచి బయలుదేరిన యాత్రికుల బృందానికి సారథ్యం వహిస్తున్న సంజయ్ కృష్ణ ఠాకూర్ మంగళవారం ఓ ట్వీట్లో తెలిపారు. ఇందుకు మార్గం సుగమం చేసిన భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ బృందంలో 70కి మందికి పైగా భక్తులు ఉన్నారని, తమను పవిత్ర మానస సరోవర్లో స్నానాలకు చైనా అధికారులు అనుమతించలేదని ఆరోపిస్తూ ఠాకూర్ సోమవారంనాడు ఓ ట్వీట్, అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. అలాంటప్పుడు తమకు వీసాలెందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పవిత్ర స్నానాలు చేయకుండా ఆ ప్రాంతాన్ని వదలి పెట్టేది లేదని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. దీనికి సుష్మాస్వరాజ్ స్పందిస్తూ, విషయం కొంత భిన్నంగా కనిపిస్తోందని, నిజానికి నిర్దిష్ట ప్రాంతాల్లోనే పవిత్ర స్నానాలు చేయాల్సి ఉంటుందని, ఎక్కడపడితే అక్కడ చేయడానికి అనుమతి ఉండదని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా అధికారులు తమకు నిర్దిష్ట ప్రాంతాలు కేటాయించినట్టు ఠాకూర్ మంగళవారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







