మహేష్ ప్రాణ మిత్రుడిగా అల్లరి నరేష్!
- May 30, 2018
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు 25 వ చిత్రానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశిపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట.
ఈ చిత్రం షూటింగ్ వచ్చేనెల 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మరో స్పెషల్ ఏంటంటే..మహేష్ బాబు ప్రాణ మిత్రుడిగా అల్లరి నరేష్ నటించబోతున్నాడట.
మహేష్ సంపన్న కుటుంబానికి చెందినవాడైతే..అతి పేద కుంటుంబలో ఉన్న యువకుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్ ను ఫైనలైజ్ చేశారట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







