సినీ స్టార్స్ - పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్..

- June 03, 2018 , by Maagulf
సినీ స్టార్స్ - పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్..

పోలీసులు, ప్రజల మధ్య అనుంబంధాన్ని పెంచేందుకు గాను పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పీపుల్స్‌ లీగ్‌(హెచ్‌పీఎల్‌) పేరుతో పోలీసులకు , సినీ స్టార్స్ కు మధ్య క్రికెట్ మ్యాచ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ సేడియం ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, యువ కథనాయకులు నాని, అఖిల్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు ఆడనున్నారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30గంటలకు జరుగనున్న క్రికెట్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అతిథులుగా డీజీపీ మహేందర్‌ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేదీలు వస్తున్నారని ప్రజలందరూ ఈ మ్యాచ్ ను చూసేందుకు రావొచ్చని అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com