మా జంటకు ఇరవై రెండేళ్లు..బోనీ భావోద్వేగం...

- June 03, 2018 , by Maagulf
మా జంటకు ఇరవై రెండేళ్లు..బోనీ భావోద్వేగం...

వీలైనప్పుడల్లా తన మనసులోని బాధను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. శ్రీదేవి మరణించి మూడు నెలలు అయినా తన జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే ఉన్నాయని, పిల్లలిద్దరికీ అమ్మానాన్న అన్నీ తానై పెంచుతున్నానని ఒకానొక సందర్భంలో వివరించారు. తాజాగా జూన్ 2న తమ 22వ పెళ్లిరోజు అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భార్య శ్రీదేవి దుబాయ్‌లో పెళ్లికి హాజరైన వీడియోని జత చేశారు. నా భార్య. నా ప్రాణ స్నేహితురాలు, ఆమె అందమైన ప్రేమకు ప్రతిరూపం.. నీ ప్రేమను, నీతో గడిపిన క్షణాలను, మధుర జ్ఞాపకాలను నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని తన మనసులోని భావాలను షేర్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com