మిడ్ డే బ్రేక్ టైమింగ్స్ ప్రకటించిన యూఏఈ
- June 05, 2018
యూఏఈ, సమ్మర్ మిడ్ డే బ్రేక్ పీరియడ్ మరియు టైమింగ్స్ని ప్రకటించింది. కార్మికులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఔట్ ఆఫ్ ఆఫీస్ వర్కర్స్ ఎండ తీవ్రత కారణంగా ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఈ 'మిడ్ డే బ్రేక్' టైమింగ్స్ సమ్మర్లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 15 సెప్టెంబర్ వరకు వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఈ బ్రేక్ పీరియడ్ అమల్లో వుంటుంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ నాజర్ బిన్ థని అల్ హామ్లి ఈ మేరకు డిక్రీ విడుదల చేశారు. వర్కింగ్ అవర్స్ రెండు షిఫ్టులుగా విభజిస్తారు. మొత్తం 8 వర్కింగ్ అవర్స్ వుంటాయి. వర్కింగ్ అవర్స్ని మించి కార్మికుడితో పని చేయించుకుంటే, 25 శాతానికి తక్కువ కాకుండా వేతనాన్ని అదనంగా చెల్లించాల్సి వుంటుంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు ఝాము 4 గంటల వరకు పనిచేయిస్తే 50 శాతం తక్కువ కాకుండా వేతనం చెల్లించాలి. మిడ్ డే బ్రేక్ సందర్భంగా యజమాని, కార్మికులకు రెస్ట్ సౌకర్యం కల్పించాలి. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







