మిడ్ డే బ్రేక్ టైమింగ్స్ ప్రకటించిన యూఏఈ
- June 05, 2018
యూఏఈ, సమ్మర్ మిడ్ డే బ్రేక్ పీరియడ్ మరియు టైమింగ్స్ని ప్రకటించింది. కార్మికులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఔట్ ఆఫ్ ఆఫీస్ వర్కర్స్ ఎండ తీవ్రత కారణంగా ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఈ 'మిడ్ డే బ్రేక్' టైమింగ్స్ సమ్మర్లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 15 సెప్టెంబర్ వరకు వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఈ బ్రేక్ పీరియడ్ అమల్లో వుంటుంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ నాజర్ బిన్ థని అల్ హామ్లి ఈ మేరకు డిక్రీ విడుదల చేశారు. వర్కింగ్ అవర్స్ రెండు షిఫ్టులుగా విభజిస్తారు. మొత్తం 8 వర్కింగ్ అవర్స్ వుంటాయి. వర్కింగ్ అవర్స్ని మించి కార్మికుడితో పని చేయించుకుంటే, 25 శాతానికి తక్కువ కాకుండా వేతనాన్ని అదనంగా చెల్లించాల్సి వుంటుంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు ఝాము 4 గంటల వరకు పనిచేయిస్తే 50 శాతం తక్కువ కాకుండా వేతనం చెల్లించాలి. మిడ్ డే బ్రేక్ సందర్భంగా యజమాని, కార్మికులకు రెస్ట్ సౌకర్యం కల్పించాలి. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







