విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్..

- June 06, 2018 , by Maagulf
విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్..

ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ గోఎయిర్‌ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే  అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ రేపటితో ముగియనుంది..  'మాన్‌సూన్‌ సేల్‌' లో భాగంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. గోఎయిర్‌ సంస్థ. రూ..1,299 రూపాయల  ధరతో వన్‌వే టికెట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు గోఎయిర్‌ ప్రకటించింది. ఈ టికెట్ల అమ్మకం  సోమవారం ప్రారంభం కాగా గురువారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జూన్‌ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్‌, జమ్మూ, కోచి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, పట్నా, పుణె, శ్రీనగర్‌ వంటి నగరాలకు గోఎయిర్‌ సంస్థ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com