మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం...
- June 08, 2018
మలేషియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరిట నిరుద్యోగులు నిలువునా మోసపోయారు. 17 మంది యువకులకు నకిలీ వీసాలు, టిక్కెట్లు పంపించి రూ.13.60 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు గురువారం బాధితులు చేరుకుని బోరుమన్నారు. ఈ సంఘట న పలాస–కాశీబుగ్గ పట్టణాల్లో కలకలం రేపింది.
పలాస–కాశీబుగ్గ పట్టణానికి చెందిన రాజ్కుమార్ మలేషియాలో ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడే వెల్డర్గా పని చేస్తున్న కార్తీక్తో కలిసి నిరుద్యోగులకు గాలం వేశా రు. ఇందులో భాగంగా పలాసలో ఉంటున్న రాజ్కుమార్ తమ్ముడు గజపతి సహకారంతో మలేషి యాలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలి కారు. ఇతడు మెడికల్, ఇతర దొంగ సర్టిఫికెట్ల తయారీలో దిట్ట.
ఈ మేరకు గత నెల 15న టిక్కెట్లు ఇస్తున్నామని నకిలీ వీసా, విమాన టిక్కెట్లు వాట్సాప్, మెయిల్లో పంపించి ఒక్కొక్క రి నుంచి రూ. 80 వేల చొప్పున వసూలు చేశారు. అదే తేదీన తీరా టిక్కెట్లు పనిచేయడంలేదని నచ్చచెప్పి చెన్నై విమానాశ్రయం నుంచి వెనక్కి రప్పిం చేశారు. అనంతరం ఈ నెల 3వ తేదీన టిక్కెట్లు ఇస్తామని నమ్మబలికి మరలా డూప్లికేట్ వీసాలు, టిక్కెట్లు పంపారు. దీంతో కోపోద్రిక్తులైన బాధితులు పలాసలో రాజ్కుమార్, కార్తీక్ ఇళ్లకు గురువారం చేరుకున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







