బహ్రెయిన్:ఫుట్ బాల్ స్టేడియంకి శంకుస్థాపన
- June 08, 2018
బహ్రెయిన్:యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా డైరెక్టివ్స్ నేపథ్యంలో ఫుట్బాల్ స్టేడియం శంకుస్థాపన చేపట్టింది. యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్టర్ హిషామ్ అల్ జౌదార్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్ అల్ హస్సామ్ క్లబ్ కోసం ఈ స్టేడియంని ఏర్పాటు చేస్తున్నారు. బహ్రెయిన్లో ఫుట్బాల్ క్రీడకు మరింత వన్నె తెచ్చే దిశగా ఈ ఫుట్బాల్ స్టేడియం ఉపయోగపడ్తుందని అల్ జౌదార్ అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ యువతకు స్పోర్ట్స్ రంగంలో చేయూతనందించేందుకు కింగ్ హమాద్ తీసుకుంటున్న చొరవను అద్భుతమని ఎంపీ బు మజీద్ కొనియాడారు. ఉమ్ అల్ హస్సామ్ క్లబ్ ఛైర్మన్ డాక్టర్ హిషామ్ అబ్దుల్రహ్మాన్ అల్ బినాలి మాట్లాడుతూ, ఫుట్బాల్ స్టేడియం శంకుస్థాపనకు రావడం ద్వారా నేషనల్ క్లబ్స్కి ఆయన మద్దతు స్పష్టమయ్యిందని అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







