రంజాన్ సందర్భంగా జనసేన యాత్రకు విరామం: పవన్ కళ్యాణ్
- June 09, 2018రంజాన్ సందర్భంగా జనసేన పోరాట యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రంజాన్ తర్వాత తిరిగి యథావిథిగా జనసేన పోరాయ యాత్ర కొనసాగనుందని జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం చేత పవన్ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నిన్న యలమంచిలి బహిరంగ సభ ముగించుకొని విశాఖలో ఓ ప్రైవేటు రిసార్ట్స్ లో బస చేసారు జనసేనాని.
ఈరోజు ఉదయం నుండి పవన్ కల్యాణ్ విశాఖకు చెందిన కొందరు మేధావులుతో వరుస సమావేశం అవుతున్నారని ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పవన్ను కలిసిన వారిలో ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం సమసిపోవడానికి అవిశాత్రంగా పోరాటం చేస్తోన్న కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ కమిషన్ లో సేవలు అందించిన ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై మూడు రోజులపాటు మేధావులతో చర్చించనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి వీరితో సమావేశాలు నిర్వహించి సోమవారం సాయంత్రం హైదరాబాదు బయలు దేరనున్న పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్