అసంతృప్తిగా ముగిసిన జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు

- June 10, 2018 , by Maagulf
అసంతృప్తిగా ముగిసిన జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు

జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు అసంతృప్తిగా ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వాణిజ్య విధానాలను కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్రూడో వైఖరిపై మండిపడ్డ ట్రంప్‌ అమెరికాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్‌ వస్తువులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. జీ7 దేశాల సంయుక్త ప్రకటన నుంచి కూడా అమెరికా దూరంగా ఉంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com