ఢిల్లీలో రాజకీయ వేడిని రగిలించిన ఏపీ సీఎం
- June 16, 2018ఢిల్లీలో రాజకీయ వేడిని రగిలించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన ఆయన.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం విజయన్తో భేటీ అయ్యారు. ఏపీ భవన్కు వచ్చిన ఈ ముగ్గురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు.. చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రశ్నించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎలా వ్యవహరించాలన్నది ప్రధానంగా చర్చిస్తున్నారు.
అటు రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ను పరామర్శించనున్నారు ముఖ్యమంత్రులు. ఆయన పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. కేజ్రీవాల్ను కలవడానికి ఇప్పటికే ఎల్జీ కార్యాలయం అనుమతిని కోరారు మమతా బెనర్జీ. అయితే... ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో.. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి.. ఆయన సతీమణిని కలిసి సానుభూతి వ్యక్తం చేయనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ